బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్

-

కేంద్ర బడ్జెట్‌ను నేడు పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. దీనిమీద సామాన్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

మరికాసేపట్లో ఈ ప్రక్రియ సాగనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ సమావేశం కాగా 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అంతకు ముందు నిర్మలా సీతారామన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా రాష్ట్రపతి భవన్ వెళ్లి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత బడ్జెట్‌కు సంబంధించిన కీలక పత్రాలకు రాష్ట్రపతికి అందజేశారు.ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటుకు బయలు దేరారు.ఆమె వెంట బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషించిన ఫైనాన్స్ అధికారులు ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version