వరద బాధితులకు రూ. 20 లక్షలు ఇవ్వాల్సిందే – బండి సంజయ్‌

-

చనిపోయిన కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇండ్లు కోల్పోయిన వారికి రూ.10 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్‌. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల తెలంగాణలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ప్రకటన ద్వారా తెలిపారు బండి సంజయ్‌. ఇప్పటికే 20 మంది చనిపోయారని.. మరో 25 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. ఇంతవరకు వారి ఆచూకీ లేదు.

వేలాది సంఖ్యలో పశువులు చనిపోయాయి. వేలాది ఇండ్లు మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం జరిగింది. రోడ్లు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదలవల్ల మరణాలు సంభవించాయే తప్ప భారీ వర్షాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ చనిపోయిన దాఖలాల్లేవన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమే. దొంగలు పడ్డ అర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version