బీఆర్ఎస్ నేత పాడేమోసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, బండి సంజయ్

-

బీఆర్ఎస్ నేత, హుజరాబాద్ పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు నందగిరి మహేందర్ రెడ్డి గురువారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. నందగిరి మహేందర్ రెడ్డి కుటుంబం సైదాపూర్ మండలం రాయికల్ నుండి వచ్చి చాలాకాలంగా హుజురాబాద్ లో నివాసం ఉంటుంది. గతంలో ఆయన ఏబీవీపీ కార్యకర్తగా, బిజెపి అధ్యక్షుడిగాను పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇక ఆయన మృతదేహం వద్ద “డాడీ.. లే.. డాడీ” అంటూ తన కొడుకు రోదనలు అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించాయి.

ఇక నేడు నందగిరి మహేందర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అనంతరం మహేందర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news