తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ గా ప్రకాష్ జవదేకర్

-

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాస్త డైనమాలో పడిపోయింది భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో పలితాలు తమకు అనుకూలంగా వస్తే తెలంగాణలో ఇక తిరుగులేదని భావించిన బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. ఇక కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కీలక నేతల చేరికలతో దూకుడుమీదుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణలో పుంజుకుంటే అది తమ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందని బిజెపి ఆందోళన చెందుతుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బిజెపి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా ప్రకాష్ జవదేకర్, సహాయ ఇన్చార్జిగా సునీల్ బన్సల్ ని నియమించింది. ఇక మధ్యప్రదేశ్ కి భూపేంద్ర యాదవ్, చతిస్గఢ్ కు ఓం ప్రకాష్, రాజస్థాన్ కి ప్రహ్లాద్ జోషిని ఎన్నికల ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news