కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చలాయించింది కేటీఆరే: బండి సంజయ్‌

-

కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చలాయించింది కేటీఆరేనని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కేటీఆరే చేశారని ఆరో పించారు. పదేళ్లు జిల్లా నుంచి మంత్రిగా ఉన్నా.. సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. సిరిసిల్లలో నేతన్నల దీన పరిస్థితికి కేసీఆర్‌, కేటీఆరే కారణమని మండిపడ్డారు. నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని విమర్శించారు. నేతన్నకు 50 శాతం విద్యుత్‌ రాయితీ ఇస్తామని మోసగించారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పరస్పర దూషణలకు దిగుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు నేతన్నల బకాయిలు చెల్లిస్తామని కాంగ్రెస్‌ మోసగించిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మోసగించినందునే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ కూడా గెలిచాక పలు రూపాల్లో దోపిడీకి యత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్.. కాంగ్రెస్‌ మాయ మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version