అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో MIM, BRS దోస్తీ బయటపడింది : బండి సంజయ్

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్​పై మండిపడ్డారు. కేసీఆర్ మజ్లిస్​కు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. ఎంఐఎం.. బీఆర్ఎస్ బీ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అవుతారని అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడటం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, ఎంఐఎంల వైఖరి స్పష్టమవుతోందని వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మున్నూరు కాపు సంఘం సమావేశానికి బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేశ రాజకీయాలు కులమతాలకు అతీతంగా ఉండాలని బండి సంజయ్ అన్నారు. కుల సంఘాలు, ఆయా కులాల్లోని పేదలను ఆదుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందారని ఆరోపించారు. మున్నూరు కాపులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం కులాలను అడ్డుపెట్టుకునే పద్ధతిని రాజకీయ పార్టీలు మానుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు

Read more RELATED
Recommended to you

Latest news