అయ్యపేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తాజాగా సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవగాహనతోనే ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారు. కృష్ణా, కాళేశ్వరం పై విచారణ జరపాలి. దోషులను జైలుకు పంపాలి. సిరిసిల్లా జిల్లాకు కేవలం ఏడు పథకాల కోసమే రూ.1408 కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. ఈ జిల్లాలో మొక్కల పెంపకం కోసమే రూ.266 కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. మరీ ఆ నిధులన్నీ ఏమైపోయాయి అన్నారు. 

ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు. పైసలిచ్చేది మోడీ.. మీ కోసం కొట్లాడేది బీజేపీ.. కానీ కాంగ్రెస్ కి ఓటు వేయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ని గుడి మింగితే.. కాంగ్రెస్ గుడిలోని లింగాన్ని సైతం మింగేసే బాపతు అంటూ ఘాటు విమర్శలు చేశారు. నేను మా తాత, అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. కార్యకర్త నుంచి ప్రజల నుంచి పోరాడి ఎంపీ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తమే.. బీజేపీకి ఓటు వేసి మోడీని మళ్లీ ప్రధాని చేద్దామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news