బీఆర్ఎస్ ఓడిపోయే చోట…ప్రతిపక్ష నాయకుడికి డబ్బులు – బండి సంజయ్

-

బీఆర్ఎస్ ఓడిపోయే చోట…ప్రతిపక్ష నాయకుడికి డబ్బులు ఇస్తున్నారని సీఎం కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇవాళ కరీంనగర్ జిల్లా మానకొండుర్ లో పర్యటించిన ఎంపి బండి సంజయ్ మాట్లాడుతూ….సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులకు సగం మందికి టికెట్లు ఇవ్వరని తెలిపారు. ఎక్కడైతే బిఆర్ఎస్ ఓడిపోయే సీటు ఉంటదో అక్కడ ఆపోజిట్ వ్యక్తికి డబ్బులు సహాయం చేస్తాడన్నారు.

రామగుండం ఎమ్మల్యే కు డబ్బులు పంపింది సిఎం కేసీఆర్ కదా అని నిలదీశారు. వాళ్ళ ఎమ్మెల్యేలే స్వయంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు ఉన్నారని… కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ తో దళితులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. దళిత కుటుంబాలకు అనేక ప్రోత్సాహలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటూ చురకలు అంటించారు. ఇతర రాష్ట్రాల నుండి ఇంచార్జిలుగా వచ్చిన ఎమ్మేల్యే లతో చాలా మంచి స్పందన వచ్చిందని బండి సంజయ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news