ముస్లింల ధోబీఘాట్లు, సెలూన్లకూ ఉచిత విద్యుత్తు…. బండి సంజయ్‌ సీరియస్

-

ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని.. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయని మండిపడ్డారు. ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? ఈ నయా నిజాం కు మత పిచ్చి ఎక్కువైంది. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజం లో ఉన్న కులవృత్తులను అణిచివేస్తున్నారని నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ది మత దురహంకారమని.. బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి అయినా సరే MIM ను సంతృప్తి పరచాలన్నది కేసీఆర్ లక్ష్యం అంటూ ఆగ్రహించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బీసీ ల కులవృత్తులపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ కులాల వాళ్ళు తీవ్ర మనో వేదనలో ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news