మహిళల మానప్రాణాలకంటే ఫర్నిచర్ ముఖ్యమా..? జైనూరు ఘటన పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణలోని  కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ యువతి పై షేక్ మగ్దూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జైనూరు పట్టణంలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో కర్ఫ్యూ కూడా విధించారు. ఘటనకు పాల్పడినటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జైనూరు ఘటనలో బాధితురాలుని పరామర్శించారు. అనంతరం ఆమె ముఖం పై ఉన్న గాయాలను చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జైనూరులో దుకాణాలు దగ్ధమయ్యాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు బండి సంజయ్. మహిళల మాన ప్రాణాల కంటే ఫర్నీచర్ ముఖ్యమా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news