కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నేడు కరీంనగర్ లో జరుగుతుంది. ఈ సభలో బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డా అని స్పష్టం చేశారు బండి సంజయ్. ” ఆత్మ అభిమానం చంపుకొని పనిచేయడం కష్టం. ధర్మం కోసం యుద్ధం చేస్తా. నన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారు. అవమానాలకి భయపడే వ్యక్తిని కాదు.

కార్యకర్తలు, ప్రజల కష్టార్జితం వల్లే ఎంపీగా గెలిచాను. నాకు టికెట్ ఇచ్చినప్పుడు డిపాజిట్ కూడా రాదని హేళన చేశారు. నా గెలుపుతో యావత్ దేశం ఆశ్చర్యపోయింది. కరీంనగర్ కార్యకర్తల వల్లే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యాను. కరీంనగర్ లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోడీ, అమిత్ షా చెప్పారు. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలని చెప్పారు ” అని ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news