భద్రాద్రి రామయ్య సన్నిధిలో వింత పక్షి..చూశారా ?

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కొలువయి ఉన్న భద్రాద్రి రాముల వారి సన్నిధిలో ఒక వింత పక్షి సందడి చేసింది. ఎక్కడి నుండో వచిందో తెలియదు కానీ భద్రాచలం రామాలయం పూర్వ యాగశాల యందు వింత పక్షి కనిపించింది.  రామదాసు కీర్తనలు ఆలకిస్తూ మమేకమై రామా శరణు అంటూ ప్రార్థిస్తున్నట్లు కనిపించింది.  ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ వింత ఆకారం గా కనిపించడంతో భక్తులు తమ తమ సెల్ఫోన్లలో బంధించారు.

నీరసించి నట్టుగా  కనిపిస్తున్న ఈ పక్షి రామయ్యను ప్రార్థిస్తున్నట్లు కనిపించింది. రామ కీర్తనలు వస్తున్న అంతసేపు రెండు కళ్లు మూసుకుని ఆలకిస్తున్నట్లు కనిపించింది. కీర్తనలు ఆగిపోయాక అది కళ్ళు తెరిచ్చి తనను వింతగా చూస్తున్న జనాన్ని వింతగా చూడడం గమనార్హం. అయితే ఇది ఏమి పక్షి అనేది తెలియక పోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news