అసెంబ్లీ నిర్వహణ తీరుపై భట్టి అసంతృప్తి

-

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. సభ సంప్రదాయాలను స్పీకర్, అధికారపక్ష నేతలు పాటించడం లేదని విమర్శించారు. సభలో ఎజెండా ఏంటో చెప్పడం లేదని అన్నారు. అప్పటికప్పుడు ఏజెండా పెడితే ఎలా అని ప్రశ్నించారు. సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారో కూడా చెప్పడం లేదని మండిపడ్డారు భట్టి విక్రమార్క.

ప్రశ్నోత్తరాల్లో స్పీకర్ తమకు సమయం ఇవ్వడం లేదని.. అన్నింటికీ అధికార సభ్యులే మాట్లాడుతున్నారని విమర్శించారు. సభ్యులు ప్రశ్నలు వేస్తే మంత్రులు జవాబులు చెప్పాలి.. కానీ ఉపన్యాసాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రశ్నకు సభ్యుడి పేరు ఉంటేనే మైక్ ఇస్తామని అనడం శాసనసభ్యుల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version