BREAKING : నేడు కరీంనగర్ లో టీటీడీ ఆలయానికి భూమి పూజ

-

BREAKING : నేడు కరీంనగర్ లో టీటీడీ ఆలయానికి భూమి పూజ జరుగనుంది. నేడు కరీంనగర్ లో టిటిడి ఆలయానికి భూమి పూజ చేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మెన్ వై వి సుబ్బారెడ్డి, మంత్రి గంగుల కమలాకర్. ఈ తరుణంలోనే… ఒక రోజు ముందే కరీంనగర్ కు చేరుకున్నాయి గజరాజులు. ఇవాళ ఉదయం 6.50 నుండి 7.20 వరకు కొనసాగనుంది భూమి పూజ కార్యక్రమం.

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మంకమ్మ తోట వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రతిపాదిత టిటిడి క్షేత్ర నిర్మాణ స్థలం వరకు సారెతో శోభాయాత్ర జరుగనుంది. ఇక ఇవాళ సాయంకాలం వేళలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Latest news