హైదరాబాద్‌ ప్రజలారా….ధార్ గ్యాంగ్… జర జాగ్రత్త..!

-

హైదరాబాదర్‌ నగర ప్రజలారా…. ధార్ గ్యాంగ్ తో జర జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. HYD, ఉమ్మడి RRలో యూపీకి చెందిన ‘ధార్’ అనే భయంకరమైన దొంగల ముఠా తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని ఘట్కేసర్ సీఐ అశోక్ తెలిపారు.

big alert for hyderabad people

ఉదయం ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకెళతారని, ఎవరైనా అడ్డస్తే చంపేసి మరీ చోరీకి పాల్పడతారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. అర్ధరాత్రి ఎవరైనా తలుపులు కొడితే తీయొద్దన్నారు.

దీనికి తగ్గట్టుగానే…ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకానగర్లో అంతర్రాష్ట్ర దొంగల హల్చల్ చేశారు. రెక్కీ నిర్వహించిన దొంగలు… రాత్రి వేళల్లో ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారని గమనించి నిన్న రాత్రి 11తరవాత అద్దెకు రూమ్ కావాలని ఇంటికి వెళ్లారు. బలవంతంగా వృద్ధులను బలవంతంగా నోట్లో క్లాత్స్ పెట్టీ, బంధించి దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. చుట్టు ప్రక్కల ఉండే వారు వచ్చి చూడగా పారిపోయే ప్రయత్నం చేశారు దొంగలు. ఇక వారిని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. దొంగలలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news