Telangana: డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం.. షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. డిగ్రీలో చేరేందుకు మరో అవకాశాన్ని కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. డిగ్రీ ఫస్టియర్ లో కాలేజ్ సీట్ల భర్తీ కోసం స్పెషల్ కౌన్సిలింగ్… నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం స్పెషల్ కౌన్సిలింగ్ నిర్వహించనుంది.

ఈ స్పెషల్ కౌన్సిలింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతుంది. 400 రూపాయలతో ఈ నెల 9 వరకు రిజిస్ట్రేషన్, అలాగే వెబ్ ఆప్షన్ లో నమోదు ప్రక్రియ ఉంటుంది. ఇక ఈ నెల 9వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ అలాగే 11వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈనెల 11 నుంచి 13 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. అంతేకాదు ఈ నెల 12 అలాగే 13వ తేదీలలో కాలేజీలలో విద్యార్థులు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. దోస్త్ లో రిజిస్ట్రేషన్… చేసుకొని అలాగే చేసుకున్న కూడా సీట్లు రాని వారు మాత్రమే ఈ ప్రక్రియకు అర్హులు అవుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దింతో విద్యార్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news