పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ మొండి చెయ్ !

-

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 36 మందితో తొలి జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణకు చెందిన నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్- సురేశ్ షెట్కార్, నల్గొండ- కుందూరు రఘువీర్,చేవెళ్ల- సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్- బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది.అంతేకాకుండా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ (కేరళ) నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

Patel Ramesh Reddy

ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్ కేటాయించింది. అయితే, మళ్లీ పటేల్ రమేష్ రెడ్డికి మొండి హస్తం చుపించింది. 2018 ఎన్నికల్లో సూర్యాపేట నుండి పోటీ చేయకుండా తప్పుకుంటే 2019లో నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తామని పటేల్ రమేష్ రెడ్డికి ఆశ చూపి మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ ఇప్పుడు కూడా అదే పనిచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news