ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే తన్నుకున్న బీజేపీ నాయకులు !

-

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీ నాయకులు తన్నుకున్నారు. రేపే తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్ కు 9.45 గంటలకు చేరుకుంటారు ప్రధాని మోడీ. 9:45 గంటలకు హెలికాప్టర్‌ లో వరంగల్‌ కు పయనం అవుతారు. 10.15 గంటలకు మామునూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా 10:30 భద్రకాళి టెంపుల్ కు చేరుకుంటారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని 10:45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11:00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంకు చేరుకుంటారు. అయితే.. మోడీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీ నాయకులు తన్నుకున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలో బీజేపీ ఆఫీస్ మీద దాడి చోటు చేసుకుంది. నర్సంపేట పట్టణంలో రెండుగా చీలింది బీజేపీ పార్టీ. రేవూరి ప్రకాశ్ రెడ్డి, రాణా ప్రతాప్ రెండు వర్గాల వర్గ పోరు కొనసాగుతోంది. బీజేపీ పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో నర్సంపేట బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version