కల్వకుర్తి టు నంద్యాల జాతీయ రహదారి పనులు శరవేగంగా నడుస్తున్నాయి : బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్

-

నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు  తీసుకొచ్చిన కల్వకుర్తి టు నంద్యాల జాతీయ రహదారి పనులు శరవేగంగా నడుస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్  ప్రసాద్, రాష్ట్ర నాయకులు దిలీప్ చారి. పార్లమెంట్ ఎన్నికల విజయ సంకల్ప యాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భరత్ ప్రసాద్  మాట్లాడుతూ.. మే13వ తేదీ సోమవారం మూడవ నెంబర్ కమలం పువ్వు గుర్తు పైన ఓట్లు వేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందామన్నారు.  ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.  మీ ప్రాంత బిడ్డగా నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ కి పంపిస్తే మీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని  అభివృద్ధి చేస్తానన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు వంటివి తీసుకొచ్చారని.. అలాగే ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news