కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరిపించాలి: ఎంపీ లక్ష్మణ్

-

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరిపించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పి ఇప్పుడు రిటైర్డు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ వరకే అవినీతిని పరిమితం చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణ కోరాలని మింగిన సొమ్మును కక్కించాలని లక్ష్మణ్ అన్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేననే అనుమానం కలుగుతోందని లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిభాయ్ పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న అయన పార్టీ శ్రేణులతో కలిసి సావిత్రి భాయ్ పూలే చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. సావిత్రి బాయ్ సమాజంలోని అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు..పూలే ఆశయాలను నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారని వెల్లడించారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు మోదీ మహిళా బిల్లును తీసుకువచ్చారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news