నేను ఉన్న పార్టీ జెండా ఎగురాలని కోరుకుంటున్నా : తుమ్మల నాగేశ్వరరావు

-

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం కీర్తి ప్రతిష్ట నిలిపిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నన్ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి.. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటు పడ్డాను. నేను ఉన్న పార్టీ జెండా ఎగురాలని కోరుకున్నాను. అని ఆయన చెప్పుకొచ్చారు. సత్తుపల్లి ప్రజలు చాలా ధైర్యవంతులు. రాగమయి గెలుపుతో సత్తుపల్లి సత్తా చూపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేపట్టిన సత్తుపల్లిలోనే ముందుగా చేపడుతాను అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లిలో రాగమయిని గెలిపించి నా గౌరవం కాపాడారు. స్వార్థం కోసం స్వలాభం కోసం చేసే మా బ్రతుకు మాకు అవసరం లేదన్నారు. ఎల్లప్పుడూ మీ కోసం మీ బాగు కోసమే పని చేస్తానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news