Breaking : చార్మినార్ లో బిజెపి పార్టీ ముందంజ

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరహోరిగా కొనసాగుతోంది. మొదటినుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ నడుస్తోంది. అయితే అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఏడు స్థానాలలో బిజెపి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

BJP party leading in Charminar

ముఖ్యంగా ఎంఐఎం బలంగా ఉన్న చార్మినార్ నియోజకవర్గంలో ప్రస్తుతం బిజెపి ముందంజలో ఉంది. అటు బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలో తన సత్తా చాటుతున్నారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ కు ఊహించని పరిణామం ఎదురవుతోంది. హుజురాబాద్ నియోజకవర్గం మరియు గజ్వేల్ నియోజకవర్గాలలో ఈటల రాజేందర్ వెనుకబడిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version