నేను పార్టీ మారను.. సీఎం కేసీఆర్‌ తోనే ఉంటా – బోథ్ ఎమ్మెల్యే రాథోడ్

-

నేను పార్టీ మారను.. సీఎం కేసీఆర్‌ తోనే ఉంటానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు ప్రకటించారు. టికెట్ రాకపోవడంపై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ స్పందించారు. టికెట్ ఎందుకు రాలేదో నాకు తెలియదని.. అధిష్టానం, సిఎం కేసీఆర్ నిర్ణయం నాకు శిరోధార్యం అన్నారు.

ఆరోపణలు రావడం రాజకీయాల్లో కామన్‌.. నేను పార్టీ మారను…బీ ఆర్ ఎస్ లోనే ఉంటానని ప్రకటించారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్. ఏ హామీ రాలేదు.. నేను అడగలేదని…ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం లో పని చేశానని వెల్లడించారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్. రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచానని.. ఎవ్వరు కుట్రలు చేశారో నాకు తెలియదని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్‌ తోనే చివరి వరకు ఉంటానని ప్రకటించారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్.

Read more RELATED
Recommended to you

Latest news