BREAKING : వేములవాడ రాజన్న ఆలయం వద్ద బాలుడి అపహరణ

-

రాజన్నసిరిసిల్ల జిల్లా : వేముల వాడ రాజన్న సన్నిధిలో దారుణం చోటు చేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయం వద్ద బాలున్ని అపహరించారు. 28 రోజుల ఉన్న చిన్న బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వేములవాడ రాజన్న ఆలయం మెట్ల వద్ద నాలుగు రోజులుగా ఆ బాలుడి తల్లి ఉంటోందని సమచారం అందుతోంది.

కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య…. ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా ఆలయం మెట్ల వద్ద ఒంటరిగా ఉంటున్నారు. అయితే.. నిన్న అంటే ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించి.. వేకువజామున ఆ చిన్న బాబును అపహరించినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో బాధితురాలు లావణ్య వేముల వాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన వేముల వాడ పట్టణ పోలీసులు… రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news