BREAKING: ఈటెల రాజేందర్ తో రాజాసింగ్ భేటీ

-

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటి అయ్యారు బిజెపి ఎలెక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి నాయకులపై, కార్పొరేటర్ పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటెల దృష్టికి తీసుకెళ్లారు రాజాసింగ్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపి నాయకుల పట్ల కక్షపురితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

గోషామహల్ నియోజకవర్గంలో ఎలా అయినా గెలవాలని తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈటెల రాజేందర్. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బిజెపి నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతానని అన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని.. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news