తాండూరులో చోరీ కేసును చేదించిన పోలీసులు

-

వికారాబాద్ జిల్లా: తాండూరులో చోరీ కేసును చేదించారు పోలీసులు. ఈ మేరకు బుధవారం ఈ చోరీ ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. ఈనెల 14 వ తేదీన తాండూర్ పట్టణానికి చెందిన వాజిద్ కుటుంబం ఇంటికి తాళం వేసి పెళ్లికి కార్యానికి వెళ్ళింది. రాత్రి సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 28 లక్షల రూపాయలు దొంగిలించారు దొంగలు.

వాజిత్ కు పరిచయం ఉన్న వ్యక్తి అబూబకర్ మరో నలుగురితో కలిసి డబ్బుల దోపిడీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. 19 లక్షల రూపాయలు రికవరీ చేశారు. దొంగతనానికి ఉపయోగించిన ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news