దూసుకు వెళ్తున్న కేసీఆర్… ఇవాల్టి బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే

-

BRS అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే… నేడు మెదక్, సంగారెడ్డి జిల్లాలో రెండో రోజు కొనసాగనుంది BRS అధినేత కేసీఆర్ బస్సు యాత్ర. ఈ సందర్భంగా నర్సాపూర్, పటాన్ చెరు లో జరిగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా రేవంత్‌ సర్కార్‌ పై కామెంట్స్‌ చేయనున్నారు.

BRS chief KCR’s bus trip will continue for the second day in Medak and Sangareddy district today

ఇక నిన్న మెదక్‌ లో కేసీఆర్ మాట్లాడుతూ… BRS హయాంలో ఉన్న స్కీములు అమలు కావడం లేదు…సీఎం రేవంత్ మెదక్ జిల్లాని తీసేసెటట్టు ఉన్నారని ఫైర్ అయ్యారు.
మెదక్ జిల్లా ఉండాలంటే BRS ఎంపీ అభ్యర్థి గెలవాలి…నేను మెదక్ జిల్లా వాడినే కాబట్టి ఈ జిల్లాని అభివృద్ధి చేసుకున్నామన్నారు కేసీఆర్.

100 పడకల ఆస్పత్రి మెదక్ కి ఇస్తే దానిని 50 పడకలకు కుదించింది కాంగ్రెస్ అని… ఏడు పాయల కోసం 100 కోట్లు ఇస్తే వెనక్కి తీసుకువెళ్లిపోయారని ఆగ్రహించారు. పాత ప్రభుత్వంలో ఇచ్చిన మంజూరులన్ని ఆపేశారు…ప్రధాని మోడీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చి 150 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news