కాంగ్రెస్ పార్టీకి BRS నాయకుల హెచ్చరిక..!

-

కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ పోస్టుల పై చర్యలు తీసుకోవాలని BRS నాయకుల ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్ నుండి BRS, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తునా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల పైన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసారు BRS పార్టీ నేతలు.

సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసత్యమైన ఫేక్ పోస్టులు చేయడం ఆపకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు BRS పార్టీ శ్రేణులు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అసత్య ప్రచారాల పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హమీల అమలు పైన ఫొకస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచిస్తున్నారు BRS శ్రేణులు. ఇప్పటికైనా తీరు మార్చుకొని ఫేక్ పోస్టులు ఆపకుంటే బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news