అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీఎం రేవంత్ పర్యటన‌.. బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టు

-

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.. బీఆర్‌ఎస్‌ యూత్‌, విద్యార్థి విభాగం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలే పరీక్షల వాయిదా కోరుతున్నాయని, నోటిఫికేషన్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామంటూ జేఎన్టీయూ వేదికగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ పర్యటనలోనూ నిరసనకు దిగి పర్యటనను అడ్డుకునే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గం గుండా వెళ్లే ఆర్టీసీ బస్సులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news