రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈనెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం బీఆర్ఎస్. అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
అధ్యక్షతన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈనెల 11న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తుండటంతో పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ గడువుకు ముగియనుంది.
దీంతో ఈ ఎన్నికలపై కూడా ఇప్పటికే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 38 స్థానాలను చేజెక్కించుకుంది. ఇందులో దాదాపు 10
మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 21
ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన చూసుకుంటే బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే.. మరో
నలుగురు ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. రెండో అభ్యర్థిని నిలబెడితే.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులందరికీ విప్ జారీ చేయవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తుంది.