బీఆర్​ఎస్​ కు మరో షాక్​..- కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి?

-

బీఆర్​ఎస్​ పార్టీకి వరుస షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోగా.. మరికొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. తాజాగా బీఆర్​ఎస్​ పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి సీఎం రేవంత్​ రెడ్డి నివాసానికి వెళ్లడంతో త్వరలో ఆయన కూడా కాంగ్రెస్​ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బీఆర్​ఎస్​ నుంచి దానం నాగేందర్​, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్​ రెడ్డి, సంజయ్​ కుమార్​, కాలె యాదయ్య, కృష్ణమోహన్​ రెడ్డి, ప్రకాశ్​గౌడ్​, అరికెపూడి గాంధీ కాంగ్రెస్​లో చేరారు. మరికొందరు ముఖ్యంగా గ్రేటర్​ హైదరాబాద్​ నుంచి పలువురు త్వరలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహిపాల్​ రెడ్డి సీఎంను కలవడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మహిపాల్​ రెడ్డి 2014 నుంచి మూడుసార్లు వరుసగా బీఆర్​ఎస్​ తరఫున గెలిచారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో అక్కడ తన బలాన్ని పెంచుకోవడానికి గ్రేటర్​ హైదరాబాద్​ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లోకి ఆహ్వానిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version