BRSకు షాక్‌…సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు నో చెప్పిన పద్మారావు గౌడ్ ?

-

BRSకు షాక్‌ తగిలింది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు నో చెప్పారు పద్మారావు గౌడ్. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం అభ్యర్థి పై BRS లో స్పష్టత ఇంకా స్పష్టత రాలేదు. లోక్ సభ ఎన్నికల్లో పోటి చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారట పద్మారావు గౌడ్. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటి చేయాలని పద్మారావు గౌడ్ ను ఇప్పటికే కోరారట కేసీఆర్.

BRS not clear on candidate for Secunderabad Parliament seat

నిన్న సాయంత్రం కేసిఅర్ కు పోన్ చేసి తాను ఎన్నికల్లో పోటి చేయనని స్పష్టం చేశారట పద్మారావు గౌడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటి చేయాలని పద్మారావు గౌడ్ కు సూచించారట కేసీఆర్. ఇక ఇవాళ మధ్యాహ్నం తరువాత ఎర్రవల్లి ఫాంహౌస్ లో కేసిఅర్ తో భేటి కానున్నారు పద్మారావు గౌడ్, తన కుమారులు. అలాగే..ఈరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే లతో కేసీఆర్ భేటీ అవుతారు. సికింద్రాబాద్ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు BRS అధినేత కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news