బ్రేకింగ్ : భద్రాచలంలో BRS పార్టీ అఖండ విజయం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ బోణి కొట్టింది. భద్రాచలం నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 4280 ఓట్ల తేడాతో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావు విజయం సాధించారు. ఇక ఆటో అంబర్పేటలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయం సాధించారు.

Dr. Tellam Venkatarao

అంతేకాకుండా సిద్దిపేట నియోజకవర్గంలో 30 వేల మెజారిటీ వైపు దూసుకుపోతున్నారు హరీష్ రావు. సిరిసిల్ల నియోజకవర్గం లో మంత్రి కేటీఆర్ కు 28 వేల మెజారిటీ ఇప్పటికే వచ్చింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గౌడ్ కు కూడా 30 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ అభ్యర్థులు కూడా మరికాసేపట్లోనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news