ఇవాళ బీఆర్ఎస్ టికెట్ల ప్రకటన..ఈ స్థానాల్లో మార్పులు?

-

బీఆర్‌ఎస్‌ ఇవాళ అసెంబ్లీ టికెట్లు ప్రకటించనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ కేడర్​ను బలపరుచుకోవడంపై ఫోకస్ పెట్టాయి ప్రతిపక్షాలు. ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్​ను గద్దె దించాలన ప్రయత్నంలో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి.

మరోవైపు ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. అయితే.. BRS ఇవాళ విడుదల చేసే జాబితాలో ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి, ఖానాపూర్ లో రేఖా నాయక్ బదులు జాన్సన్, బోధ్ లో అనిల్ జాదవ్/నగేష్, వైరాలో రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్, వేములవాడలో రమేష్ స్థానంలో లక్ష్మీనరసింహారావు, జనగామలో ముత్తిరెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి/శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ గన్ పూర్ లో రాజయ్య స్థానంలో కడియం పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news