ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్‌, రాజయ్యకు రైతు సమన్వయ సమితి పదవి..?

-

జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,తాటికొండ రాజయ్య కు కీలక పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ నిర్నయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లకు సీఎం కేసీఆర్ రాజీ ఫార్ములా అవలంభిస్తున్నారని సమాచారం. జనగామ MLA టికెట్ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అలాగే….జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి TSRTC చైర్మన్ పదవీ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆలోచన లో ఉన్నారట. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని తాటికొండ రాజయ్య కు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. అటు రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవినీ వదులుకోవడానికి రాజేశ్వర్ రెడ్డి సిద్ధపడ్డారని టాక్‌. బాజిరెడ్డి గోవర్ధన్ ఒప్పించి ఆర్టీసీ చైర్మన్ కు రాజీనామా చేపించి ఆ పదవిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం నిర్నయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్‌ ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news