బుల్డోజర్లను సిద్దం చేశా.. ఎవరు అడ్డు వస్తారో రండి : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ కుటుంబానిది దోపిడి చరిత్ర అన్నారు. మా ప్రభుత్వం అలాంటి వారి భరతం పడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి గీతారెడ్డికి అవార్డు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్ రావు బయటికి వచ్చారు. బుల్డోజర్లను సిద్దం చేశా.. ఎవరు అడ్డు వస్తారో రండి. మహేష్ గౌడ్ ని ఎక్కి పంపిస్తా.. మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా బిజీగా ఉంటే.. హన్మంత్ అన్న ఎక్కి బుల్డోజర్ మీద పంపిస్తానని సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి.  మూసీ మురికిలో ఉన్న మురికినీ, చెత్త తొలగించడానికి హైడ్రాను పెట్టామని తెలిపారు. పేదలు ఎవరైనా ఫామ్ హౌస్ లు కట్టగలుగుతారా..?

వాళ్ల తాపత్రయం అంతా వాళ్ల ఆస్తులను కాపాడుకోవడమే.. హరీశ్ రావు, కేటీఆర్ ఫామ్ హౌస్ లు వాళ్లే కూలగొట్టుకోవాలి. మీ ఫామ్ హౌస్ కాడికి ఎప్పుడూ రావాలో చెప్పుర్రి.. నిజ నిర్థారణ కమిటీ వేద్దాం. అనుమతి లేకుండా కట్టుకుండ్రా లేదా..? నిజాలను నిగ్గు తేల్చినంక యాడికైనా పోదాం. మూసీ కాడికైనా.. గోసీ కాడికి అయినా..పోదాం.  పేదోళ్లను అడ్డం పెట్టుకొని వాళ్ల ఫామ్ హౌస్ లను కాపాడుకుంటున్నారని తెలిపారు.  గాంధీ కుటుంబానికి  కేసీఆర్ కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version