నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు రానున్న చంద్రబాబు

-

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ (జులై 7వ తేదీ) ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు రానున్నాను. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు రంగం సిద్ధం చేశాయి. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్‌ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టీడీపీ శ్రేణుల ర్యాలీ ఉండనుంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. ర్యాలీగా ఎన్టీఆర్‌ భవన్‌ చేరుకున్న తర్వాత చంద్రబాబును టీడీపీ నేతలు సన్మానించనున్నారు.

మరోవైపు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం శనివారం రోజున ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా షెడ్యూల్‌ 10లోని అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయించారు. విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం పాటించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news