BREAKING : సాయిచంద్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్

-

BREAKING : సాయిచంద్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వెళ్లనున్నారు. కొద్దిసేపట్లో గుర్రంగూడాలోని గాయకుడు సాయిచంద్ ఇంటికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గాయకుడు సాయిచంద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించనున్నారు. అంతేకాదు… గాయకుడు సాయిచంద్ కు  కుటుంబానికి భరోసా కల్పించనున్నారు.

కాగా, ఇప్పటికే సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం వొక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news