నేడు కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దూకుడు పెంచారు. ప్రతి రోజూ మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌…నేడు కొత్తగూడెం పయనం అవుతారు. ఈ సంధర్భంగా నేడు కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇది ఇలా ఉండగా…తాజాగా కేసీఆర్ నియోజకవర్గాల రెండో షెడ్యూల్ ఖరారైంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం(నవంబర్ 3, 2023) నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుంచి 8 వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన చేపట్టనున్నారు. నవంబర్ 28 న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఅర్ ఎన్నికల ప్రచారం పూర్తి అవుతుంది. అంటే 96 నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కొనసాగనుందన్న మాట.

 

Read more RELATED
Recommended to you

Latest news