అమెరికాలో జల్సా చేసి వచ్చి ఇక్కడ హడావిడి చేస్తున్నాడు : ఎమ్మెల్యే సత్యం

-

అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చిన కేటీఆర్.. ఇప్పుడు తెగ హడావిడి  చేస్తున్నాడు అని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రజలు అల్లాడిపోతే వారి గురించి కేటీఆర్ మాట్లాడరు. రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదు. అమెరికా నుంచి రాగానే ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తాడని అనుకున్నం. సూర్యాపేట, మహబూబాబాద్ రైతులను కలుస్తడని భావించాం. కానీ కౌశిక్ రెడ్డి అనే శాడిస్ట్, సైకో, పిచ్చి కుక్క లా స్వైర విహారం చేస్తున్న వ్యక్తి ఇంటికి కేటీఆర్ పోయారు.

వీళ్ల కు తెలంగాణ జనం పైన ప్రేమ ఉందా..? బాధితుల మీద కనీసం సానుభూతి ఉందా..  రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప మరోకటి లేదు. ఎప్పుడూ రేవంత్ రెడ్డి కుర్చీ పైనే కేసీఆర్, కేటీఆర్ ఆలోచన అంతా. మా సీఎం కాళ్లలో కట్టె పెట్టి శునకానందం పొందడమే అయ్యా , కొడుకుల లక్ష్యం. తెలంగాణలో అశాంతి సృష్టించాలన్నదే వీరి ప్రధాన ఉద్దేశం. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల అరాచకాలను సాగనివ్వం. అనవసర మాటలు మాట్లాడితే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా చూస్తూ ఉరుకోం. మా సీఎం రేవంత్ రెడ్డి పైన ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఒక్కొక్కరి తాట తీస్తాం అని మేడిపల్లి సత్యం కామెంట్స్ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news