ఇవాళ నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల, కడప జిల్లాల పర్యటనకు పయనం కానున్నారు. ఇవాళ నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి…ఈ మేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు.

CM Jagan laid foundation stone for Transco sub stations today
CM Jagan 

ఈ తరుణంలోనే… నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికు వెళతారు సీఎం జగన్‌. అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్‌ సైట్‌కు చేరుకోనున్నారు సీఎం జగన్‌. నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్…ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలన, పైలాన్‌ ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కడపకు సీఎం జగన్… కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఇక సాయంత్రం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news