నేడు ‘అవుకు రెండో టన్నెల్’ ప్రారంభోత్సవం..

-

నేడు ‘అవుకు రెండో టన్నెల్’ ప్రారంభోత్సవం జరుగనుంది. రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ.567.94 కోట్ల వ్యయంతో పూర్తి అయింది అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండో టన్నెల్లు. మూడవ టన్నెల్, ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి.

Avuku Second Tunnel

దీనితో ఇప్పటికే మొత్తం రూ.1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి. నేడు రెండో టన్నెల్ను జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా మెట్టుపల్లి వద్ద విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఈ మేరకు ఇవాళ నంద్యాల, వైస్సార్ జిల్లాకు పయనం కానున్నారు సీఎం జగన్. అటు కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి…ఈ మేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news