ఐనవోలు మలన్న బ్రహ్మోత్సవాలకు కేసీఆర్‌కు ఆహ్వానం

-

వరంగల్‌ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నెల 13 నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వేదపండితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.

మరోవైపు ఐనవోలు మలన్న బ్రహ్మోత్సవాలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతి ఏర్పాట్లకు సంబంధించిన పనిలో నిమగ్నమయ్యారు. బ్రహ్మోత్సవాలకు మరో మూడ్రోజులే ఉండటంతో ఉత్సవాల ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news