ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..షెడ్యూల్‌ ఇదే

-

ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌ చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన నాగర్ కర్నూల్ కు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్ కర్నూల్ లోని తేజ గార్డెన్స్ కు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌..అనంతరం తేజ గార్డెన్లో భోజనం చేయనున్నారు.

CM KCR will go to Nagar Kurnool by road
CM KCR will go to Nagar Kurnool by road

ఇక ఇవాళ మధ్యాహ్నం 2:30 కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్ కు చేరుకోనున్న కేసీఆర్… అనంతరం కంట్రోల్ రూమ్ లో మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. నాలుగు గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్న కేసీఆర్… నాలుగు గంటల 45 నిమిషాలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఐదు గంటలకు రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకోనున్న కేసీఆర్… అనంతరం కొల్లాపూర్ లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news