యాసంగి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీఎం ఆదేశం

-

యాసంగి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నారు.

అయితే మొక్కజొన్న క్వింటాలకు ప్రభుత్వం మద్దతు ధర రూ. 1962 గా నిర్ణయించారు. ప్రధానంగా మొక్కజొన్నను ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో సాగుచేశారు. అయితే ఇటీవల అకాల వర్షాలకు పలు జిల్లాలలో మొక్కజొన్న పంట కొంత దెబ్బతిన్న తరుణంలో ప్రభుత్వం కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news