రేపు, ఎల్లుండి రెండ్రోజుల పాటు కేరళలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజుల పర్యటన నిమిత్తం కేరళ వెళ్లనున్నారు. బుధవారం రోజున ఆయన హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేరనున్నారు. బుధ, గురు రెండ్రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కేరళలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం 18వ తేదీ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఈనెల 19వ తేదీన మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ సభల్లో పాల్గొననున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఛరిష్మా చూసిన అధిష్ఠానానికి.. ఆ తర్వాత వచ్చిన ఫలితాలతో ఆయన స్టామినాపై నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్ ఛరిష్మాను వినియోగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆయణ్ను పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా కేరళకు వెళ్లనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, మరోసారి ఆంధ్ర ప్రదేశ్లోనూ రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news