నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం..షెడ్యూల్ ఇదే

-

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ముఖ్యంగా ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్‌…..20 న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు.

ఈ నెల 20 న సాయంత్రం కర్ణాటక లో ప్రచారం లో పాల్గొననున్న రేవంత్… 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 22 న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్‌… 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభ లో పాల్గొన్ననున్నారు. ఈ నెల 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభ ల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news