కేంద్ర మంత్రి సింధియాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

-

కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి భేటీ అయ్యారు. అయితే టీ-ఫైబర్ ప్రాజెక్టును భార‌త్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు స‌మ‌ర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. టీ – ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వ‌ర్క్ కల్పించడం అని సీఎం తెలిపారు.

టీ-ఫైబర్ యొక్క ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడం.. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం మా లక్ష్యం అని సీఎం అన్నారు. టీ-ఫైబర్‌ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వ‌ర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేయాలని అన్నారు. అలాగే టీ-ఫైబర్ కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను కోరారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version