డ్యూటీకి రావాలనందుకు డాక్టర్ పై హత్యాయత్నం..!

-

డ్యూటీకి రావాలనందుకు డాక్టర్ పై హత్యాయత్నం చేసాడు ఏఎన్ఎమ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ వైద్యుని పై ఓ ఏఎన్ఎమ్ ఏడుగురు యువకులతో కలిసి రాడ్ తో హత్యాయత్నం చేసారు. విధులకు హాజరు కాకుంటే పై ఆఫీసర్స్ కు రిపోర్ట్ చేస్తానని కాల్వశ్రీరాంపూర్ PHC హాస్పిటల్ డాక్టర్ మహేందర్ ఏఎన్ఎమ్ తో తెలిపాడు.

దాంతో ఆగ్రహానికి గురైన ఏఎన్ఎమ్ కాసిపాక విజయ డాక్టర్ ను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. గత నెల తన స్నేహితులతో కలిసి డాక్టర్ మహేందర్ కారు ఆపి ఇనుప రాడ్లతో హతమార్చే యత్నం చేసింది. ఇక ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. ఏఎన్ఎమ్ విజయ మరియు తన స్నేహితులు ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు పెద్దపల్లి ఏసీబీ గజ్జి కృష్ణ. నిందితురాలు కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామ ఏఎన్ఎమ్ గా పని చేస్తుంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version