రుణ మాఫీ చేయకపొతే నిరాహార దీక్ష చేస్తా..!

-

రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలను అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. రుణమాఫీ విషయం లో కాంగ్రెస్ మంత్రులది ఒక్క మాట సీఎంది ఒక్కమాట అని నిర్మల్ వేదికగా బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. బూటకపు మాటలతో గద్దేనెక్కి రైతులను మోసం చేస్తున్నారు. సీఎం దేవుళ్లపై ఒట్టు పెట్టి అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇంకా 38 లక్షల మందికి రుణ మాఫీ కాలేదు అని పేర్కొన్నారు.

అలాగే రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోంది. రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. రైతాంగానికి బీజేపీ అండగా ఉంటుంది. ఈనెల ఆఖరిలోగా రైతులందరికీ రుణ మాఫీ చేయకపొతే హైదారాబాద్ లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టుతాను అని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.రుణ మాఫీ చేస్తానని దేవుళ్ళ పై సీఎం ప్రమాణం చేసి మాట తప్పారు. రాష్ట్రంకు అది అరిష్టం. ఆ అరిష్టం పోవడానికి దేవాలయాల్లో మేము పూజలు చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 2 లక్షల వరకు రైతులను రుణ విముక్తులను చేయాలి అని మహేశ్వర్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version